Guntur GGH: పసికందులను ఎలుకలు కొరికిన ఘటనలు అందరికీ గుర్తే: విడదల రజిని
Guntur GGH: ముఖ్యమంత్రి జగన్ (YS Jaganmohan Reddy) వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని (Vidadala Rajini) స్పష్టం చేశారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. గుంటూరు జీజీహెచ్లోని (Guntur GGH) మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి రజని తెలిపారు. ఏపీలో రూ.8 వేల కోట్లతో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు (Medical Collages) ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Guntur GGH: ముఖ్యమంత్రి జగన్ (YS Jaganmohan Reddy) వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని (Vidadala Rajini) స్పష్టం చేశారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని.. క్యాన్సర్కు కూడా అత్యుత్తమ చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు వైద్య రంగంపై నిర్లక్ష్యం వహిస్తే.. వైఎస్సాఆర్సీపీ (YSRCP) ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఏపీలో రూ.8 వేల కోట్లతో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు (Medical Collages) ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు కింద 16 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గుంటూరు జీజీహెచ్లోని (Guntur GGH) మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి రజని తెలిపారు.
హాస్పిటల్ నిర్మాణానికి పూర్వవిద్యార్థులు నిధులు మంజూరు చేయటం గర్వకారణమన్నారు. జింఖానా సభ్యులు యూఎస్లో (America) ఉన్నప్పటికీ.. ఇక్కడి పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే వారి ఉద్దేశ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంటూరు జీజీహెచ్లో ఎలుకలు కొరికి పసిపిల్లలు మృతి చెందటం, కరెంటు పోతే డాక్టర్లు సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు చేసిన సంఘటనలు అందరికీ గుర్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం జీజీహెచ్ను నాడు-నేడు కింద కూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి "భలే మంచిరోజు" అంటూ పాటపాడటం అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంది.
హాస్పిటల్ నిర్మాణానికి పూర్వవిద్యార్థులు నిధులు మంజూరు చేయటం గర్వకారణమన్నారు. జింఖానా సభ్యులు యూఎస్లో (America) ఉన్నప్పటికీ.. ఇక్కడి పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే వారి ఉద్దేశ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంటూరు జీజీహెచ్లో ఎలుకలు కొరికి పసిపిల్లలు మృతి చెందటం, కరెంటు పోతే డాక్టర్లు సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు చేసిన సంఘటనలు అందరికీ గుర్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం జీజీహెచ్ను నాడు-నేడు కింద కూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి "భలే మంచిరోజు" అంటూ పాటపాడటం అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంది.