తెలుగు దేశం పార్టీ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతల ఆందోళనలతో నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబు గుండెలపై బూటుకాలుతో తన్నినట్లు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన సృహ తప్పి పడిపోయారు. వెంటనే అరవింద్ బాబును నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
అరవింద్బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్పై వైసీపీ శ్రేణుల దాడికి దిగారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారని నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్బాబుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడ్డ అరవింద్బాబు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. డాక్టర్లతో మాట్లాడి అరవింద్ ఆరోగ్య పరిస్థితి చంద్రబాబు తెలుసుకున్నారు. అరవింద్బాబుకు మెరుగైన వైద్యం అందించాలని అధినేత కోరారు.
అరవింద్బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్పై వైసీపీ శ్రేణుల దాడికి దిగారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారని నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్బాబుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడ్డ అరవింద్బాబు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. డాక్టర్లతో మాట్లాడి అరవింద్ ఆరోగ్య పరిస్థితి చంద్రబాబు తెలుసుకున్నారు. అరవింద్బాబుకు మెరుగైన వైద్యం అందించాలని అధినేత కోరారు.