యాప్నగరం

Palnadu: పల్నాడు జిల్లా మాచవరంలో.. 'కేజీఎఫ్‌' స్టైల్ మైనింగ్‌!

Palnadu: పల్నాడు జిల్లాలో ఇప్పుడు అక్రమ మైనింగ్ ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై.. టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేజీఎఫ్ తరహాలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఫైర్ అవుతున్నారు. తాజాగా.. టీడీపీ నేత యురపతినేని శ్రీనివాసరావు మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులను చూసి అవాక్కయ్యారు. కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో.. దాదాపు 35 చోట్ల అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 7 Mar 2023, 12:00 pm

ప్రధానాంశాలు:

  • పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్ ఆరోపణలు
  • గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై టీడీపీ ఫైర్
  • 'కేజీఎఫ్‌' స్టైల్ మైనింగ్‌ చేస్తున్నారని ఆరోపణలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Illegal mining in Palnadu district
పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్
Palnadu: పల్నాడు జిల్లాలో కేజీఎఫ్‌ సినిమా పేరు మారుమోగుతోంది. మాచవరం మండలం రేగులగడ్డ సమీపంలోని అటవీ ప్రాంతంలో.. కేజీఎఫ్ (KGF) తరహా అక్రమ తవ్వకాలు కనిపిస్తున్నాయని.. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో కలిసి యరపతినేని శ్రీనివాసరావు కృష్ణా నది మీదుగా నాటు పడవల ద్వారా మైనింగ్‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడి పరిస్థితులను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
'గురజాల నియోజకవర్గంలో దాదాపు 35 చోట్ల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి (Kasu Mahesh Reddy) ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన రేగులగడ్డ సమీపాన అటవీ ప్రాంతం.. కృష్ణా నది మధ్యన సుమారు 30 ఎకరాల్లో మైనింగ్‌ జరుగుతోంది. దీనికి ఎవరు అనుమతిచ్చారు. రెవెన్యూ, పోలీసు, విజిలెన్సు, జలవనరులశాఖ, మైనింగ్‌ అధికారులు సమాధానం చెప్పాలి' అని యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

'ఇక్కడ పనులు చేసేందుకు కూలీలను నాటు పడవల ద్వారా చేరవేస్తున్నారు. వారి ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అక్రమాలు చేస్తూ కొందరు వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి వారిని నియోజకవర్గం నుంచి తరిమికొట్టాలి. నియోజకవర్గంలో మైనింగ్‌ కోసం తవ్విన గుంతల్లో పడి ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారు' అని యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasa Rao) వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.