నెల్లూరు జిల్లా ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు మందు పంపిణీ విషయంలో తమిళనాడుతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాలు తనకు ఆహ్వానం పలికి ప్రోత్సహిస్తుంటే.. ఏపీలో మాత్రం ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీసీ వెల్ఫేర్ జేఏసీ సభ్యులు ఆయనను సన్మానించారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా మందు ఇస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్శాఖ నుంచి నోటీసులు ఇప్పిస్తూ తనను ఇబ్బంది పెడుతోందన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి వేరియంట్లనైనా తన దగ్గరున్న మూలికల ద్వారా నయం చేయవచ్చన్నారు. లక్షల మందికి కొవిడ్ సోకకుండా మందు ఇచ్చానని.. అయినా తాను నిరక్షరాస్యుడనని, వైద్యం చేయడానికి అనర్హుడనని ఆయుష్ శాఖ నోటీసులో ప్రస్తావించింది అన్నారు. తన ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇటీవలే ఆనందయ్యపై ఆయుష్ శాఖ సీరియస్ అయ్యింది. ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేస్తోన్న ఆనందయ్యకు నోటీసులు జారీ చేశారు. మందు పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. ఆనందయ్య పంపిణీ చేస్తోన్న మందుకు ఎలాంటి అనుమతి లేదని.. ఒమిక్రాన్ మందులో ఏ ఏ పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆనందయ్య ఇచ్చే సమాధానం చూసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఒమిక్రాన్ మందులో వాడే పదార్థాలు పరిశీలిస్తామన్నారు.
48 గంటల్లో ఒమిక్రాన్ తగ్గిస్తానంటూ ఆనందయ్య మందు పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆనందయ్య తయారుచేసిన మందుకు ఇప్పటి వరకు లైసెన్స్ తీసుకోలేదని.. అప్లికేషన్ పెడితే పరిశీలించి అనుమతి ఇస్తామంటున్నారు. కరోనా ఒమిక్రాన్ పేరుతో అనుమతి లేని మందులను వాడొద్దని.. ఆయుష్ శాఖ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు.
డిసెంబర్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు స్థానికుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ఇంటి ముందు జనాలు ధర్నాకు దిగారు.. మందు పంపిణీ చేయొద్దని ఆందోళన చేపట్టారు. మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నంచి వేలమంది ఇక్కడికి రావడం వల్ల తమకు కరోనా సొకుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఒమిక్రాన్కు మందు కనిపెట్టినట్లు అసత్యం ప్రచారం చేస్తున్నారని ఆనందయ్యపై మండిపడ్డారు.
ఇటు ఆనందయ్యకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్ మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో తెలపాలని ఆదేశించారు. అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా మందుపై వారంలోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తాజాగా, అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. తాను ఒమిక్రాన్ కోసం మందు అని చెప్పలేదని.. ఏ జబ్బుకైనా ఇమ్యూనిటీని మాత్రమే పెంచుతుందని ఆనందయ్య అంటున్నారు.
ఇటీవలే ఆనందయ్యపై ఆయుష్ శాఖ సీరియస్ అయ్యింది. ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేస్తోన్న ఆనందయ్యకు నోటీసులు జారీ చేశారు. మందు పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. ఆనందయ్య పంపిణీ చేస్తోన్న మందుకు ఎలాంటి అనుమతి లేదని.. ఒమిక్రాన్ మందులో ఏ ఏ పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆనందయ్య ఇచ్చే సమాధానం చూసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఒమిక్రాన్ మందులో వాడే పదార్థాలు పరిశీలిస్తామన్నారు.
48 గంటల్లో ఒమిక్రాన్ తగ్గిస్తానంటూ ఆనందయ్య మందు పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆనందయ్య తయారుచేసిన మందుకు ఇప్పటి వరకు లైసెన్స్ తీసుకోలేదని.. అప్లికేషన్ పెడితే పరిశీలించి అనుమతి ఇస్తామంటున్నారు. కరోనా ఒమిక్రాన్ పేరుతో అనుమతి లేని మందులను వాడొద్దని.. ఆయుష్ శాఖ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు.
డిసెంబర్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు స్థానికుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ఇంటి ముందు జనాలు ధర్నాకు దిగారు.. మందు పంపిణీ చేయొద్దని ఆందోళన చేపట్టారు. మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నంచి వేలమంది ఇక్కడికి రావడం వల్ల తమకు కరోనా సొకుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఒమిక్రాన్కు మందు కనిపెట్టినట్లు అసత్యం ప్రచారం చేస్తున్నారని ఆనందయ్యపై మండిపడ్డారు.
ఇటు ఆనందయ్యకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్ మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో తెలపాలని ఆదేశించారు. అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా మందుపై వారంలోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తాజాగా, అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. తాను ఒమిక్రాన్ కోసం మందు అని చెప్పలేదని.. ఏ జబ్బుకైనా ఇమ్యూనిటీని మాత్రమే పెంచుతుందని ఆనందయ్య అంటున్నారు.