యాప్నగరం

గుంటూరు: ప్రియుడిని వదిలేసి ఇంకొకరితో ఆమె అఫైర్.. ఆ రోజు రాత్రి..!

గుంటూరు జిల్లా చేబ్రోలులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో..!

Samayam Telugu 12 May 2021, 6:48 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
వివాహేతర సంబంధాలు కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాయి. వివాహేతర బంధాల కారణంగా చెలరేగే పగలు.. హత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు. తాజాగా, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగగా.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలుకి చెందిన షేక్‌ సుభానీ అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. సదరు మహిళ గతంలో గుండవరానికి చెందిన గోపి అనే యువకుడితో కలిసి ఉండేది. తర్వాత, గోపి నుంచి విడిపోయిన సదరు మహిళ.. సుభానీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, ఆ మహిళ తనకు దూరమవడానికి సుభానీయే కారణమని భావించిన గోపి అతడిపై పగ పెంచుకున్నాడు.

ఈ తరుణంలో శనివారం ఆరుబయట సుభానీ పండుకున్నారు. అర్ధరాత్రి సమయంలో సుభానీ నిద్ర మత్తులో ఉండగా, ఆయనపై గోపి.. ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. వెంటనే సుభానీ గట్టిగా కేకలు వేయసాగాడు. దీంతో భయపడ్డ గోపీ అక్కడి నుంచి పరారయ్యాడు. సుభానీ ముఖంపై తీవ్ర గాయం కావడంతో.. స్థానికులు 108కు సమాచారం అందించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.