గుంటూరు జిల్లా తెనాలి కోర్టు వద్ద పెట్రోల్ బాటిల్తో వ్యక్తి హల్చల్ చేశాడు.. పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇదే నెలలో ఒక అధ్యాపకుడు కోర్టు ప్రాంగణంలో పెట్రోల్తో నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో మళ్లీ అదే ఘటన రిపీట్ అవుతుందేమోనని అక్కడున్న పోలీసులు, న్యాయవాదులు ఆందోళనకు గురయ్యారు. తెనాలి వన్టౌన్ పోలీసులు తనను వేధిస్తున్నారంటూ చెరుకూరి ప్రదీప్ రామచంద్ర అనే వ్యక్తి కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశాడు. భార్యభర్తల మధ్య విభేదాల నేపథ్యంలో కోర్టులో కేసులు.. వన్టౌన్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు.
కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయవాదులు, పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. దగ్గరకి వస్తే కాల్చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అక్కడున్న న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ చాకచక్యంగా అడ్డుకున్నారు. అనంతరం ప్రదీప్ను అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇటీవల అప్పుల భారంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న తెనాలిలోని చినరావూరుకు చెందిన తాళ్లూరి జక్రయ్య అప్పుల భారంతో కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని.. నిప్పంటించుకుని ఈ నెల 6న ఆత్మహత్యకు పాల్పడ్డారు. మళ్లీ ఈ రోజు మరో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో కోర్టు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయవాదులు, పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. దగ్గరకి వస్తే కాల్చేసుకుంటానని బెదిరించాడు. దీంతో అక్కడున్న న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ చాకచక్యంగా అడ్డుకున్నారు. అనంతరం ప్రదీప్ను అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇటీవల అప్పుల భారంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న తెనాలిలోని చినరావూరుకు చెందిన తాళ్లూరి జక్రయ్య అప్పుల భారంతో కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని.. నిప్పంటించుకుని ఈ నెల 6న ఆత్మహత్యకు పాల్పడ్డారు. మళ్లీ ఈ రోజు మరో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో కోర్టు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.