యాప్నగరం

భార్యతో విడాకులు.. మరొక వివాహితతో సహజీవనం.. చివరికి కూతుర్ని అలా చేసి భయంతో..

Samayam Telugu 9 Dec 2021, 11:42 am
భార్యతో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్న వ్యక్తి.. హైదరాబాద్ వచ్చి భర్తను వదిలేసిన మహిళతో సహజీవనం చేశాడు.. ఆమె ఆరేళ్ల కూతురితో తిరునాళ్ల కోసం స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఆరేళ్ల పాప అల్లరి చేస్తుందని పలకతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆ కేసులో శిక్ష పడుతుందని భయపడిన ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన 42 సంవత్సరాల సాతులూరి ఫణికుమార్‌కు భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. గ్రామం నుంచి బయటకొచ్చిన అతను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి.. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా విధుల్లో చేరాడు. అయితే అదే ప్రాంతంలో ఇళ్లల్లో పనులు చేసుకుంటున్న మహిళతో పరిచయం ఏర్పడి.. ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది.

గ్రామంలో తిరునాళ్ల జరుగుతుండటంతో ముగ్గురు స్వగ్రామం జూలకల్లుకు వచ్చారు. ఈ క్రమంలో మమిళ కుమార్తెను పలకతో తలపై కొట్టడంతో పాప మృతిచెందడంతో ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని దుర్గి మండలం అడిగొప్పుల క్వారీ గుంతల్లో పడేశాడు. అయితే బాలిక మృతదేహం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఫణికుమార్‌పై కేసు నమోదు చేశారు.

హత్య కేసులో శిక్ష పడుతుందని భయపడిన ఫణికుమార్ ఏం చేయాలో తెలియక.. పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని గమనించిన కుటుంబ సభ్యులు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఫణికుమార్ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.