మంగళగిరి ఎమ్మెల్యే (Mangalagiri Mla) ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా వైఎస్సార్సీపీదే విజయం అన్నారు. మంగళగిరికి సంబంధించిన ఏ నిర్ణయమైనా జగన్ తీసుకుంటారని.. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అన్నారు. తన కుమారుడి వివాహానికి ఎవర్నీ పిలవలేదని.. కేవలం రిజిస్టర్ పెళ్లి చేయాలనుకున్నట్లు చెప్పారు. పార్టీకి, తనకు గ్యాప్ ఉందని తప్పుడు ప్రచారంలో నిజం లేదని.. రాజకీయాల్లో ఉంటే సీఎం వైఎస్ జగన్ (Ys Jagan) వెంటే ఉంటాను.. రాజకీయం వద్దనుకుంటే చక్కగా తన పొలంలో వ్యవసాయం చేసుకుంటాను అన్నారు. పొన్నూరు గ్రావెల్తో తనకేం సంబంధమని.. మంగళగిరిలో ఇసుక దందా అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వాట్సాప్ స్టేటస్లతో అంచనా వేస్తారా.. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని.. తన బాస్ జగన్.. ఆయన ఏది చెబితే అదే ఫైనల్ అన్నారు. రోజూ వెళ్లి జగన్ను కలవాల్సిన పని ఉండద కదా.. తనకు ఆయన ఫ్యామిలీ మెంబర్ అన్నారు. 2014 నుంచి 2019 మధ్య ఏం చేయలేదు కాబట్టి నారా లోకేష్ (Nara Lokesh)ను మంగళగిరిలో ప్రజలు ఓడించారన్నారు. మంగళగిరిలో ఆర్కే గ్రాఫ్ ఎలా ఉండేది సర్వే చేసుకోవచ్చన్నారు. తాను పోటీ చేయకపోయినా మంగళగిరిలో వైఎస్సార్సీపీ (YSRCP) గెలుస్తుందన్నారు ఆర్కే.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు పార్టీతో గ్యాప్ ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కుమారుడి వివాహానికి సీఎం జగన్ను ఆహ్వానించలేదని.. గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆర్కేపై ఊహాగానాలు మొదలయ్యాయి. చాలా కాలంగా ఆయన సైలెంట్ అయ్యారని.. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి టికెట్ ఆర్కేకు ఇవ్వరనే ప్రచారం జరిగింది. తనపై జరుగుతోన్న ప్రచారంపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందించారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగి నారా లోకేష్పై ఘన విజయం సాధించారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆర్కేను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారని స్వయంగా వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఆళ్లకు ఆ అవకాశం దక్కలేదు. ఆయన కూడా అధినేత నిర్ణయమే శిరోధార్యమని తేల్చి చెప్పారు. మంత్రి పదవి రాలేదనే బాధ తనకు లేదన్నారు. సామాజిక సమీకరణాలతో కేబినెట్ కూర్పు ఉంటుందన్నారు ఆర్కే.. అందుకు తగినట్లే నిర్ణయాలు ఉంటాయన్నారు. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు పార్టీతో గ్యాప్ ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కుమారుడి వివాహానికి సీఎం జగన్ను ఆహ్వానించలేదని.. గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆర్కేపై ఊహాగానాలు మొదలయ్యాయి. చాలా కాలంగా ఆయన సైలెంట్ అయ్యారని.. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి టికెట్ ఆర్కేకు ఇవ్వరనే ప్రచారం జరిగింది. తనపై జరుగుతోన్న ప్రచారంపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందించారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగి నారా లోకేష్పై ఘన విజయం సాధించారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆర్కేను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారని స్వయంగా వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఆళ్లకు ఆ అవకాశం దక్కలేదు. ఆయన కూడా అధినేత నిర్ణయమే శిరోధార్యమని తేల్చి చెప్పారు. మంత్రి పదవి రాలేదనే బాధ తనకు లేదన్నారు. సామాజిక సమీకరణాలతో కేబినెట్ కూర్పు ఉంటుందన్నారు ఆర్కే.. అందుకు తగినట్లే నిర్ణయాలు ఉంటాయన్నారు. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు.