యాప్నగరం

కన్నతల్లి కాదు కసాయి.. ఆడపిల్ల పుట్టిందని.. కర్కశంగా..

Samayam Telugu 9 Dec 2021, 12:03 pm
ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లే కసాయిగా మారి రోజుల బిడ్డను చంపేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మొదటి సాధారణ మృతిగా చిత్రీకరించి.. ఆ తర్వాత ఏఎన్ఎం ఆరాతో అసలు విషయం బయటకొచ్చింది. అనుమానం రాకుండా ఉండేందుకు ఎవరికీ తెలియకుండానే పాప మృతదేహాన్ని ఖననం చేసి ఆ తల్లి కర్కశంగా ప్రవర్తించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గుంటూరు జిల్లా తాడికొండ మండల రావెల గ్రామానికి చెందిన బొంతా లక్ష్మి ఈ నెల 2న గుంటూరు జీజీహెచ్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. సోమవారం ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయిన తల్లీబిడ్డను ఏఎన్ఎం స్వప్న పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నారని నిర్థారించింది. అయితే మంగళవారం పాప నోటి నుంచి సురగ వస్తోందని తల్లి బొంతా లక్ష్మి సమాచారమివ్వగా ఏఎన్ఎం, వైద్యసిబ్బంది అక్కడికి వెళ్లి పాపను పరిశీలించి.. జీజీహెచ్‌కు రిఫర్ చేశారు.

మళ్లీ సాయంత్రం పాపను చూసేందుకు ఏఎన్ఎం వెళ్లగా పాప చనిపోయిందని, ఖననం కూడా చేశామని తల్లి సమాధానమిచ్చింది. అనుమానమొచ్చిన ఏఎన్ ఎం స్వప్నను నిలదీయగా తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారని, మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో తానే పాప గొంతులో వేలు పెట్టి చంపేసినట్టు నేరం అంగీకరించింది. ఈ విషయం కాగితంపై రాసి సంతకం పెట్టిన లక్ష్మి దీని గురించి ఎవరికైనా చెబితే తన చావుకు ఏఎన్ ఎం కారణమని పేరు రాసి చస్తానని బెదిరించినట్టు స్వప్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.