యాప్నగరం

Undavalli Sridevi: ఏంటీ.. ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి నిన్ను హ‌త్య చేస్తారేమోన‌ని భ‌య‌ప‌డ్డవా: నందిగం సురేష్

Undavalli Sridevi: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా అధికార పార్టీలో సస్పెన్షన్ల వరకూ వెళ్లాయి. నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. వారిలో ఉండవల్లి శ్రీదేవి గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందని పార్టీ భావించి సస్పెండ్ చేసింది. తాజాగా.. ఆమె మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి చేసిన కామెంట్స్‌పై.. ఇటు వైసీపీ నుంచి రియాక్షన్లు స్టార్ట్ అయ్యాయి. ఎంపీ నందిగం సురేష్.. శ్రీదేవిపై సెటైర్లు వేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 26 Mar 2023, 5:09 pm

ప్రధానాంశాలు:

  • ఏపీకి రావాలంటే భయమేస్తుందన్న ఉండవల్లి శ్రీదేవి
  • ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై వైసీపీ నేతల విమర్శలు
  • ఉండవల్లి శ్రీదేవికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన ఎంపీ సురేష్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sridevi vs Suresh
శ్రీదేవి వర్సెస్ సురేష్
Undavalli Sridevi: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఆమె ఎవ్వరికీ అందుబాటులోకి రాలేదు. తాజాగా.. ఆదివారం ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రావాలంటే.. భయమేస్తుందని శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఆమె చేసిన కామెంట్స్‌ Andhra Pradesh రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై ఇటు అధికార వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh) శ్రీదేవి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏంటీ ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి నిన్ను హ‌త్య చేస్తారేమోన‌ని భ‌య‌ప‌డి క‌నిపించ‌కుండాపోయి.. ఈరోజు ప్రెస్‌మీట్ పెడుతున్నావా? త‌ాను టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యేల‌ను.. తానే చంపుకునే అల‌వాటు సీఎం జగన్‌కు లేద‌మ్మా? అలాగే నీలా అమ్ముడుపోయే వారి గురించి ఆలోచించే అల‌వాటు కూడా లేదు' అని నందిగం సురేష్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఉండవల్లి శ్రీదేవి కొన్నాళ్లుగా పార్టీ దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గానికి సమన్వయ కర్తగా వేరే నేతగా నియమించినప్పుటి నుంచి.. ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే.. చాలాసార్లు ఆ నియోజకర్గంలో వర్గపోరు బయట పడింది. దీంతో పార్టీ అధిష్టానం కూడా తాడికొండపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అటు 2024లో శ్రీదేవికి టికెట్ ఇవ్వబోనని జగన్ చెప్పినట్టు ప్రచారం కూడా జరిగింది. దీంతో అమె పార్టీపై అసంతృప్తిగా ఉందనే టాక్ వినిపించింది. ఒక దశలో ఆమె పార్టీ మారొచ్చనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో.. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని జోరుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. స్వయంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆమె పేరును ప్రస్తావించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రాజకీయం మరో మలుపు తిరిగింది. ఇటు ఉండవల్లి శ్రీదేవి కూడా.. సజ్జలపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నుంచి హాని ఉందని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన కామెంట్స్.. ఏపీలో రాజకీయ రచ్చకు కారణమయ్యాయి.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.