యాప్నగరం

నోట్ల కట్టలు, ఆస్తి పత్రాలను కుప్పగా పోసి నిప్పు అంటించి.. మహిళ ఆత్మహత్య

చేతిలో డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చని చాలా మంది భావిస్తారు. కానీ డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. డబ్బు ఎంత ఉన్నప్పటికీ నా అనే వాళ్లు దగ్గరలేకపోతే భరించలేం. కొడుకు, కూతుళ్లు దూరంగా ఉంటుండటంతో.. ఎడబాటును భరించలేకపోయిన ఓ మహిళ నోట్ల కట్టలు, ఆసి పత్రాలను కుప్పగా పోసి నిప్పు అంటించింది. అనంతరం తాను కూడా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నరసరావుపేటలో చోటు చేసుకుంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 21 May 2022, 6:29 pm

ప్రధానాంశాలు:

  • పిల్లలు దూరంగా ఉంటున్నారనే ఆవేదన
  • ఎడబాటు భరించలేక తల్లి ఆత్మహత్య
  • నోట్ల కట్టలను కుప్పగా పోసి తగలబెట్టి..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu narasaraopet woman suicide
narasaraopet woman suicide
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డి పేటలో పోట్ల కుమారి(50) అనే మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆస్తి పేపర్లు, నగదును దగ్ధం చేసి.. కిరోసిన్ పోసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి మంటలను ఆర్పేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుమారి ఆత్మహత్య చేసుకోవడానికి ఒంటరితనం, మానసిక కుంగుబాటే కారణమని తెలుస్తోంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన కోట్ల రామారావు, కుమారి దంపతులు రెండున్నరేళ్లుగా నరసరావుపేటలోని రామిరెడ్డి పేటలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కాగా.. వారందరికీ పెళ్లిళయ్యాయి. ఉద్యోగ రీత్యా కుమారుడు భార్యతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా.. కుమార్తెలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు.

పెద్ద కుమార్తె కుమారుడు ఇటీవలి వరకూ కుమారితోపాటే ఉన్నాడు. కానీ గురువారం పెద్ద కుమార్తె బాబును తనతో తీసుకొని వెళ్లింది. దీంతో కుమారి ఒంటరితనానికి లోనైంది. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఎవరూ తమతో ఉండటం లేదనే వేదనకు లోనైంది. భర్త బయటకు వెళ్లిన సమయంలో రూ.7 లక్షల నగదు, ఆస్తి ప్రతాలు, బ్యాంక్ ఖాతా పుస్తకాలను కుప్పగా పోసి వాటికి నిప్పు అంటించింది. అనంతరం తాను కూడా నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.

విలువైన భూములు.. చేతిలో అవసరానికి సరిపడా సొమ్ము.. ఒంటి నిండా బంగారం.. ఉన్నప్పటికీ ఆత్మీయులు, ముఖ్యంగా పిల్లలు తోడుగా లేకపోతే చాలా మంది తట్టుకోలేరు. నా అనే వాళ్లు దగ్గర లేకుండా.. ఒంటరిగా జీవితం వెళ్లదీయం ఎంతో కష్టం కూడుకున్నది. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరితనానికి అలవాటు పడతారు. కానీ కుమారి మాత్రం అలా అలవాటు పడలేక.. బలవనర్మణానికి పాల్పడింది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.