వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (YSRCP MLA) జనసేన పార్టీ (Janasene Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పెదకాకాని మండలం ఉప్పలపాడులో.. జనసేన ఆధ్వర్యంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే అన్నదానంలో జనసేన నాయకులతో కలిసి భోజనం వడ్డించారు. పెదకాకాని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి పాల్గొన్నారట. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్సీపీలో ఉంటూ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి మెగా హీరోల బర్త్ డే వేడుకలు చేస్తున్నారని సోషల్ మీడియాలో సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగుతూ, ఎమ్మెల్యేగా ఉండి జనసేన పార్టీ కార్యక్రమాలకు తన ఫంక్షన్ హాల్ను ఫ్రీగా ఇచ్చారని పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే తీరుపై స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
వైఎస్సార్సీపీలో ఉంటూ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి మెగా హీరోల బర్త్ డే వేడుకలు చేస్తున్నారని సోషల్ మీడియాలో సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగుతూ, ఎమ్మెల్యేగా ఉండి జనసేన పార్టీ కార్యక్రమాలకు తన ఫంక్షన్ హాల్ను ఫ్రీగా ఇచ్చారని పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే తీరుపై స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.