యాప్నగరం

నరసరావుపేటలో రియల్టర్ దారుణ హత్య.. పొద్దున్నే దారికాచి..

నరసరావుపేటలో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తన వెంచర్‌ వద్దకి వెళ్తుండగా దుండగులు దారికాచి చంపేశారు. గతంలో మరో రియల్టర్ హత్యకి ప్రతీకారంగానే మర్డర్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Samayam Telugu 7 Jul 2021, 3:10 pm
గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ హత్య కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. పొద్దున్నే వెంచర్ వద్దకి వెళ్తున్న రియల్టర్‌ని దుండగులు దారికాచి చంపేశారు. ఈ ఘటన పట్టణ శివారు రావిపాడు సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో జరిగింది. నరసరావుపేటకి చెందిన కోటపాటి మల్లికార్జున రావు అలియాస్ వెంగమాంబ మల్లికార్జున రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల రావిపాడు సమీపంలో నూతన వెంచర్ వేశాడు.
Samayam Telugu ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
narasaraopet murder


ప్రతిరోజూ ఉదయం మల్లికార్జున రావు తన వెంచర్‌ వద్దకి వెళ్లి వస్తుంటాడు. అదే అదనుగా ప్రత్యర్థులు దారికాచి దారుణంగా హత్య చేశారు. స్కూటీపై వస్తుండగా ఒక్కసారిగా దాడి చేశారు. ముఖంపై సర్ఫ్ పౌడర్ కొట్టి కొబ్బరిబోండాల కత్తితో కిరాతకంగా నరికి చంపేశారు. ఈ ఘటనతో పట్టణం ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మల్లికార్జున రావు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.

డీఎస్పీ విజయభాస్కర రావు స్పాట్‌కి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపేశారని.. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. అయితే మృతుడు మల్లికార్జున రావు 2019లో జరిగిన మరో రియల్టర్ తడికమల్ల రమేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తెలుస్తోంది. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.