గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు దగ్గర రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.. మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలాగే కారు కింద పడి పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ కారును ఇద్దరు మైనర్లు కారు నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగం కారణంగా కారు అదుపుతప్పి ఇలా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారు డ్రైవింగ్ చేసిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో కూడా బయటకు వచ్చింది.
తెనాలిలో కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు, సీసీ వీడియో వైరల్
తెనాలిలో కారు జనాల మీదకు దూసుకెళ్లింది.. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మైనర్లు కారు నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది.
ప్రధానాంశాలు:
- తెనాలిలో జనాలపైకి దూసుకెళ్లిన కారు
- ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి
- కారు మైనర్లు నడిపినట్లు గుర్తించారు