యాప్నగరం

ముఖ్యమంత్రి మూర్ఖుడు, ఏపీలో వ్యవస్థలు విధ్వంసం: నారా లోకేశ్ ఫైర్

Narasaraopet టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబుపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. సంబంధం లేని విషయంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి..

Samayam Telugu 16 Jan 2022, 9:16 am
నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబుపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలన్నిటిని విధ్వంసం చేస్తాడనడానికి.. నరసరావుపేటలో జరిగిన ఘటన ఉదాహరణ అని అన్నారు. సంబంధం లేని విషయంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు.
Samayam Telugu టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్


శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్ బాబుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదని నారా లోకేశ్ అన్నారు. అరవింద్ బాబును అరెస్ట్ చేయడమే కాకుండా.. ఆయనను తరలిస్తున్న అంబులెన్స్‌పై వైఎస్సార్సీపీ రౌడీ మూకలు దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. పోలీసుల ఏకపక్ష ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు.

కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతల ఆందోళనలతో నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు గుండెలపై బూటుకాలుతో తన్నినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన సృహ తప్పి పడిపోయారు. వెంటనే అరవింద్ బాబును నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.