యాప్నగరం

గుంటూరులో ఇద్దరు వాచ్‌మెన్ల దారుణ హత్య.. వాళ్ల పనేనా!

Guntur Watchmens Murder కలకలంరేపింది. యమహా షోరూం దగ్గర ఒకర్ని.. మరో లిక్కర్ మార్ట్ దగ్గర మరొకర్ని దారుణంగా హతమార్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 1 Mar 2023, 11:51 am

ప్రధానాంశాలు:

  • గుంటూరులో ఇద్దరు వాచ్‌మెన్‌ల హత్య
  • లిక్కర్ మార్ట్, బైక్ షోరూం దగ్గర ఘటనలు
  • దోపిడీ దొంగల పనిగా అనుమానిస్తున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Guntur Watchmens Murder
గుంటూరులో ఇద్దరు వాచ్‌మెన్ల హత్య కలకలంరేపింది. ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర యమహా షోరూమ్ వాచ్‌మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున వాచ్‌మెన్‌ను దుండగులు కొట్టి చంపారు. చోరీ చేసే ప్రయత్నంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బైక్‍ను అపహరించేందుకు దొంగలు ప్రయత్నించగా.. వాచ్‍మెన్ అడ్డుకోవడంతో హత్యచేసి దొంగలు పారిపోయి ఉంటారని చెబుతున్నారు.
అలాగే అరండల్ పేట పదో లైన్ లిక్కర్ మార్ట్ వాచ్‌మెన్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. లిక్కర్ మార్ట్‌లోనూ చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు వాచ్‌మెన్‌లు దారుణ హత్యకు గురికావడం కలకలంరేపుతోంది. ఈ హత్యలతో గుంటూరువాసులు ఉలిక్కిపడ్డారు. గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ అరీఫ్ హఫీజ్‌, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది దోపిడీ దొంగల పనిగా అనుమానిస్తున్నారు.

మరోవైపు సంఘటనా స్థలంలో కొన్ని కీలకమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఇద్దరు యువకులు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువకులు బైక్ పైన వచ్చినట్లు గుర్తించారు.. మొదట అమరావతి రోడ్ లోని సెక్యూరిటీ గార్డును హత్య చేశారని డీఎస్పీ అంటున్నారు. ఆ తర్వాత అరండల్ పేట పదో లైన్ లో లిక్కర్ మార్ట్ లో సెక్యూరిటీ గార్డును హత్య చేశారని తెలిపారు. మరొక రెండు షాపుల్లో చోరీకి పాల్పడుతూ ఉండగా పోలీసులకు సమాచారం అందింది అన్నారు.

ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. దొంగలు ఇద్దరు పారిపోతుండగా వారిని వెంబడించి అరెస్ట్ చేశామన్నారకు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని.. 24 గంటల్లో దొంగల్ని పట్టుకుంటామన్నారు. ఇటు కొంతకాలంగా నగరంలో దొంగతనాలు కలవరపెడుతున్నాయి. రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని స్థానికులు కోరుతున్నారు. నిన్నటి వరకు చోరీలు మాత్రమే.. ఇప్పుడు ఏకంగా హత్యలు జరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.