యాప్నగరం

YS Jagan ఇంటి వద్ద పోలీసులకు చుక్కలుచూపించిన మహిళ.. విచారణలో ఆసక్తికర విషయాలు!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఓ మహిళ హల్‌చల్ చేసిన వ్యవహారం కలకలం రేపింది. చివరికి..!

Samayam Telugu 27 Mar 2021, 1:12 am
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటి వద్ద హల్‌చల్ చేసిన మహిళ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం జగన్ ఇంటి వద్ద హడావుడి చేసిన మహిళను పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన మేరకు.. ఈ నెల 24వ తేదీ రాత్రి విశాఖలోని సీతమ్మపేటకు చెందిన ఓ మహిళ సీఎం క్యాంపు కార్యాలయ సమీపంలోని భారతమాత విగ్రహం వద్ద ఉన్న పోలీసు చెక్‌పోస్టు వద్దకు చేరుకుంది. తన సమస్యను ముఖ్యమంత్రికి చెప్పాలని, ఆయనను కలవాలంటూ పట్టుబట్టింది.
Samayam Telugu సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నించిన మహిళ


సీఎంను కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలని, ఇప్పుడు కుదరదని చెక్‌పోస్టు సిబ్బంది చెప్పడంతో వారిపై దూషణలకు దిగింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులో తీసుకొని స్టేషన్‌కు తెచ్చి విచారించారు. అయితే, ఆమె చెప్పిన మాటలు విన్న పోలీసులకు మతిపోయినంత పనైంది.

తాడేపల్లి సీఎం జగన్ నివాసం దగ్గర మహిళ హల్చల్.. పోలీసుల్ని టెన్షన్ పెట్టి!
విశాఖపట్నంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న తనకు ఆ ఇంటి యజమాని చేతబడి చేయించాడని, ఫలితంగా తన అందం పోయిందని సదరు మహిళ పోలీసులకు చెప్పింది. తనకు జరిగిన అన్యాయం గురించి సీఎంకు చెప్పుకోవాలని వస్తే అడ్డగిస్తున్నారని పోలీసు స్టేషన్‌లో హల్‌చల్‌ చేసింది. ఆమె మాటలతో ఆశ్యర్యపోయిన పోలీసులు.. రాత్రంతా ఆమెను మహిళా పోలీసుల సంరక్షణలో ఉంచారు. గురువారం ఉదయం స్టేషన్‌ నుంచి ఆమె పారియేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరికి ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతితో ఆమె మానసిక పరిస్థితి పరీక్షించి, విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించాలని అనుకుంటున్నట్లు సీఐ అంకమరావు వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.