యాప్నగరం

సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీలో వర్గపోరు.. కళ్లల్లో కారం చల్లి యూత్ కన్వీనర్‌పై దాడి !

YSRCP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అనుచరుడు, పార్టీ యూత్ కన్వీనర్ షేక్ కరీముల్లాపై గతరాత్రి దాడి జరిగింది. కళ్లల్లో కారం చల్లి అతనిపై దాడికి పాల్పడ్డారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 4 Oct 2022, 9:49 am
YSRCP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అనుచరుడు, పార్టీ యూత్ కన్వీనర్ షేక్ కరీముల్లాపై గతరాత్రి దాడి జరిగింది. నియోజకవర్గంలో హోర్డింగ్‌ల నిర్వహణ విషయంలో వైఎస్సార్‌సీపీలోని ఇరు వర్గాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. షేక్ కరీముల్లాకు పార్టీలో కొందరు నాయకులకు మధ్య పొసగటం లేదు.
Samayam Telugu ysrcp new
వైకాపా నేతపై దాడి


ఈ నేపథ్యంలో కరీముల్లా కళ్లలో కారం చల్లి సోమవారం రాత్రి దాడి చేశారు. తన పార్టలో ప్రత్యర్థి వర్గం వారే తనపై దాడి చేసినట్లు కరీముల్లా సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేగ డిజిటల్ యాజమాన్యంపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.