యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్.. సీరియస్ అంటూ వస్తున్న వార్తలపై వివరణ

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆమెపై వస్తున్న పుకార్లపై వివరణ ఇచ్చారు.

Samayam Telugu 14 Apr 2021, 8:28 pm
గుంటూరు జిల్లా తాడికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కార్యాలయం వెల్లడించింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఎమ్మెల్యే కార్యాలయం ఖండించింది. ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా తేలిన మాట వాస్తవమేనని.. అయితే అశ్రద్ధ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించిందంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.
Samayam Telugu ఉండవల్లి శ్రీదేవి


ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యం నిలకడగానే ఉందని కార్యాలయ వర్గాలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీదేవి చికిత్స తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలోనే ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్యంతో తిరిగి వస్తారని.. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.