బద్వేలు ఉప ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్లు చేశారు. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేశారని ఆయన ఆరోపించారు. మండలానికి ఒక ఇంచార్జ్ను పెట్టుకుని తమ పార్టీ ఏజెంట్లను బెదిరించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలను రిపీట్ చేశారని అన్నారు. వాస్తవానికి 53 శాతం పోలింగ్ జరగాల్సి ఉండగా.. దొంగ ఓట్లతో 68 శాతానికి పెంచారని ఆరోపించారు.
బస్సుల్లో ఓటర్లను తరలించి బస్ పోల్గా మార్చారని సోము వీర్రాజు అన్నారు. బద్వేలు పోల్ను బస్ పోల్గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పోలింగ్ బూత్ల్లో దొంగ ఓట్లు విచ్చలవిడిగా వేశారని అన్నారు. 28 పోలింగ్ కేంద్రాలను తాము గుర్తించామని.. వీటిలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొన్నామని అన్నారు. దొంగతనంగా ఓట్లు వేసుకున్న వారికి బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని.. వారికి దమ్ము లేదు.. ధైర్యం లేదు.. దొంగలు వారు అని సోము వీర్రాజు మండిపడ్డారు.
అనంతరం మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లపై తాము ముందే చెప్పామని.. తాము చెప్పినట్లే జరిగిందని ఆయన అన్నారు. బద్వేలు ఎన్నికల్లో డబ్బులు వైసీపీ నేతలు ఓపెన్గా పంచారని ఆరోపించారు. వైసీపీ సినిమా అయిపోందని.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారన్న విషయం తెలుసుకోవాలన్నారు.
బస్సుల్లో ఓటర్లను తరలించి బస్ పోల్గా మార్చారని సోము వీర్రాజు అన్నారు. బద్వేలు పోల్ను బస్ పోల్గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పోలింగ్ బూత్ల్లో దొంగ ఓట్లు విచ్చలవిడిగా వేశారని అన్నారు. 28 పోలింగ్ కేంద్రాలను తాము గుర్తించామని.. వీటిలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొన్నామని అన్నారు. దొంగతనంగా ఓట్లు వేసుకున్న వారికి బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని.. వారికి దమ్ము లేదు.. ధైర్యం లేదు.. దొంగలు వారు అని సోము వీర్రాజు మండిపడ్డారు.
అనంతరం మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లపై తాము ముందే చెప్పామని.. తాము చెప్పినట్లే జరిగిందని ఆయన అన్నారు. బద్వేలు ఎన్నికల్లో డబ్బులు వైసీపీ నేతలు ఓపెన్గా పంచారని ఆరోపించారు. వైసీపీ సినిమా అయిపోందని.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారన్న విషయం తెలుసుకోవాలన్నారు.