ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు క్యాసినో పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. కడపలో జరిగిన మీడియా సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. కడప జిల్లా ప్రజలను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఖండించారు.
ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ హయాంలో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే.. చంద్రబాబు వారిని బెదిరించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రెండ్లీ ప్రభుత్వం ఉందని.. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ప్రభుత్వం కోరుతోందన్నారు. ప్రభుత్వానికి భారమైనా ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం.. ముఖ్యమంత్రిని దూషించడం మంచిది కాదన్నారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని కుట్రలు చేస్తున్న వారి ట్రాప్లో ఉద్యోగులు పడొద్దని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జీతాలు లేకుండా ప్రజాసేవ చేస్తామని.. ఉద్యోగులు ఒప్పుకుంటారా..? అని ఆయన ప్రశించారు. టీడీపీ, బీజేపీలకు ప్రజల సంక్షేమం అవసరం లేదని.. వారికి రాజకీయాలే ముఖ్యమని మండిపడ్డారు. సీఎంను మానవ బాంబ్తో చంపుతామంటారు.. మంత్రులను, ఎమ్మెల్యేలను చంపేస్తామంటారా..? టీడీపీ నేతలు అరాచకవాదుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వం జూదాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదు.. క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వంద క్లబ్లను మూయించారు. హైదరాబాద్లో నైట్ లైఫ్ కల్చర్ ఏర్పాటు చేశానని చంద్రబాబే ఒప్పుకున్నారు. నైట్ లైఫ్ అంటే డిస్కోలు, బార్లు, పబ్లు, క్యాసినోలే.. వీటిని చంద్రబాబే ప్రోత్సహించారు..' అని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ హయాంలో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే.. చంద్రబాబు వారిని బెదిరించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రెండ్లీ ప్రభుత్వం ఉందని.. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ప్రభుత్వం కోరుతోందన్నారు. ప్రభుత్వానికి భారమైనా ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం.. ముఖ్యమంత్రిని దూషించడం మంచిది కాదన్నారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని కుట్రలు చేస్తున్న వారి ట్రాప్లో ఉద్యోగులు పడొద్దని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జీతాలు లేకుండా ప్రజాసేవ చేస్తామని.. ఉద్యోగులు ఒప్పుకుంటారా..? అని ఆయన ప్రశించారు. టీడీపీ, బీజేపీలకు ప్రజల సంక్షేమం అవసరం లేదని.. వారికి రాజకీయాలే ముఖ్యమని మండిపడ్డారు. సీఎంను మానవ బాంబ్తో చంపుతామంటారు.. మంత్రులను, ఎమ్మెల్యేలను చంపేస్తామంటారా..? టీడీపీ నేతలు అరాచకవాదుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వం జూదాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదు.. క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వంద క్లబ్లను మూయించారు. హైదరాబాద్లో నైట్ లైఫ్ కల్చర్ ఏర్పాటు చేశానని చంద్రబాబే ఒప్పుకున్నారు. నైట్ లైఫ్ అంటే డిస్కోలు, బార్లు, పబ్లు, క్యాసినోలే.. వీటిని చంద్రబాబే ప్రోత్సహించారు..' అని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.