యాప్నగరం

నువ్ ఏడవకమ్మా.. నేనున్నా కదా.. అంతా నేను చూసుకుంటా: సీఎం జగన్

CM Jagan: తన సొంత నియోజకవర్గం పులివెందుల వేదికగా.. ఓ నిరుపేద కుటుంబంలో భరోసా నింపారు ముఖ్యమంత్రి జగన్. నిరుపేద బిడ్డ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, మీరు నిశ్చితంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల కంట ఆనందబాష్పాలు రాలాయి.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 2 Dec 2022, 9:21 pm

ప్రధానాంశాలు:

  • తన బిడ్డను బతికించాలని జగన్‌కు తల్లిదండ్రుల వినతి
  • తానున్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్
  • ఎంత ఖర్చయినా తామే భరిస్తామని హామీ ఇచ్చిన సీఎం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagan talking to the victims
బాధితులతో మాట్లాడుతున్న జగన్
CM Jagan: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్ రెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డి. అతనికి మూడున్నర సంవత్సరాల చిరు ప్రాయంలోనే లివర్ దెబ్బతింది. చాలామంది వైద్యుల వద్దకు తిరిగారు. వైద్యుల సూచనలతో బెంగళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు. అయితే.. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని.. పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. నిరుపేదలైన దివాకర్ రెడ్డి కుటుంబం.. అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని స్థితిలో లేదు.
ఈ నేపథ్యంలో.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు.. బాధిత కుటుంబాన్ని తీసుకొచ్చారు. దివాకర్ రెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికి హామీ ఇచ్చారు.

తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. జిల్లా కలెక్టర్ విజయరామరాజును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో దివాకర్ రెడ్డి దంపతులు ఆనందబాష్పాలతో ముఖ్యమంత్రికి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పారు. అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ముఖ్యమంత్రి జగన్ తక్షణ స్పందనపై పొగడ్తల వర్షం కురిపించారు. పేదలు బాధలో ఉన్నారంటే.. సీఎం జగన్ నేనున్నా అంటారని ప్రశంసలు కురిపించారు.
Read LatestAndhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.