యాప్నగరం

రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. మాజీ మంత్రి మరోసారి సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్కోలో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనిని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Samayam Telugu 29 Oct 2021, 3:46 pm
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్కోలో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనిని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగించాలన్నారు. సీఐడీ దరిద్ర, అధ్వాన్న పరిస్థితులలో ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని 193 సోసైటీలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu డీఎల్ రవీంద్రారెడ్డి


2010 నుంచి ఏకరూప దుస్తులకు ఉపయోగిస్తున్న క్లాత్ మొత్తం మిల్‌ మేడ్‌ వస్త్రమే అన్నారు. అయితే చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతూ.. మిల్‌ మేడ్‌ క్లాత్ కొనుగోలు చేయడంతో దాదాపు రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని డీఎల్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ ఓ సలహాదారుడు, సీఐడీ, అప్పటి ఆప్కో ఛైర్మన్‌ ముగ్గురు కలిసి సీఎంకు తెలియకుండా కుంభకోణానికి తెరలేపారని అన్నారు. కోట్లాది రూపాయల నగదు పక్కదోవ పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి తెలుసుకోవాలని డీఎల్ రవీంద్రారెడ్డి సూచించారు. ఓ మంచి అధికారితో అయినా లేదా సీబీఐతో అయినా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోయినా సొమ్మును రాబట్టుకోవాలని కోరారు. తానేసిన ప్రశ్నలకే సీఐడీ నిర్లక్ష్యంగా సమాధానిమిస్తే ఎలా అని డీఎల్ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.