కడప, రాయలసీమవాసులకు తీపి కబురు. కడప నుంచి విజయవాడ, చెన్నైలకు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పదం రద్దుచేసుకోవడంతో ఇండిగోకు అవకాశం కల్పించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇండిగో సంస్థ మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను చెన్నై–కడప, విజయవాడ–కడప మధ్య నడపనుంది. ఈ విమానాలు అందుబాటులోకి వస్తే కడప నుంచి విజయవాడకు ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. కడప మాత్రమే కాదు రాయలసీమవాసులకు కూడా ఇది శుభవార్త అని చెప్పాలి.
కడప, రాయలసీమవాసులకు శుభవార్త.. మార్చి 27 నుంచి పక్కా, ఇక రయ్ అంటూ!
సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇండిగో సంస్థ మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను చెన్నై–కడప, విజయవాడ–కడప మధ్య నడపనుంది.
Samayam Telugu 1 Feb 2022, 6:06 am
ప్రధానాంశాలు:
- కడప, రాయలసీమవాసులకు శుభవార్త
- మార్చిలో ఇండిగో విమాన సర్వీసులు
- కడప నుంచి విజయవాడ, చెన్నైకు