యాప్నగరం

Ys Jagan సొంత జిల్లాను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఈ నెల 20న!

Kadapa Koulu Rythu Bharosa Yatra కు ముహూర్తం ఫిక్సైంది. ఈ నెల 20న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను జనసేన పార్టీ విడుదల చేసింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 Aug 2022, 6:32 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pawan Kalyan
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) సొంత జిల్లాను టార్గెట్ చేశారు. తాజాగా జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర (Kadapa Koulu Rythu Bharosa Yatra) ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో జరగనుంది. అప్పుల బాధలతో కుంగిపోయి ప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి.. వారి కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమాలో పాల్గొంటారు.
పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జనసేన పార్టీ నేతలు పాల్గొంటారు. జనసేనాని చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో పూర్తయ్యింది. ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో తొలి విడత పూర్తయిన సంగతి తెలిసిందే.
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా రైతుల వివరాలను సేకరించి సాయాన్ని అందజేస్తోంది. అలాగే పవన్ తనవంతుగా రూ.5కోట్లు విరాళం ఇచ్చారు .
అంతేకాదు జనసేన నుంచి ఆర్థికంగా సాయం అందించడమే కాదు.. చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం మరో మంచి ఆలోచన చేసింది.

రైతుల పిల్లల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ ప్రత్యేక నిధిని కూడా తమ ప్రభుత్వంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదని.. వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సంక్షేమ నిధిలో సగం డబ్బు తానే ఇస్తానని.. మిగిలిన సగం తమ పార్టీ నేతలు అందజేస్తారని తెలిపారు. అన్నం పెట్టే అన్నదాతలకు అండగా ఉండాలనే కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టినట్లు జనసేనాని తెలిపారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.