యాప్నగరం

ఒక భార్యకే చేయూత డబ్బులొచ్చాయని.. పులివెందులలో దారుణం

ఆయనకి ఇద్దరు భార్యలు. ఇటీవల విడుదల చేసిన వైఎస్సార్ చేయూత పథకం కింద ఒక భార్యకే డబ్బులు అకౌంట్లో జమయ్యాయి. రెండో భార్యకి రాలేదని వాలంటీర్‌పై దారుణానికి పాల్పడ్డారు.

Samayam Telugu 24 Jun 2021, 6:41 pm
జగన్ నవరత్నాలు ఆ వాలంటీర్ ప్రాణాల మీదకు తెచ్చాయి. ఇద్దరు భార్యలుంటే ఒకరికే డబ్బులు వచ్చాయని.. మరొకరికి రాలేదంటూ ఏకంగా వాలంటీర్‌ని రాళ్లు, కర్రలతో కొట్టిన దారుణ ఘటన సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని లింగాల మండలం చిన్నకూడాల గ్రామానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. వారికి ఒకే రేషన్ కార్డు ఉంది. అయితే ఇటీవల సీఎం జగన్ విడుదల చేసిన వైఎస్సార్ చేయూత డబ్బులు ఒక భార్యకే పడడం చిచ్చు రాజేసింది.
Samayam Telugu వైఎస్సార్ చేయూత
cheyutha


మరో భార్యకి డబ్బులు రాలేదని వాలంటీర్‌పై కోపం పెంచుకున్నారు. తమకు డబ్బులు రాకపోవడానికి వాలంటీర్ మహేష్‌ కారణమని రగిలిపోయారు. అదను చూసి వాలంటీర్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రామ్మోహన్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వాలంటీర్ మహేష్ ఇటీవల సేవారత్న అవార్డు పొందడం విశేషం. డబ్బుల కోసం సేవారత్ననే చితకబాదడం పులివెందులలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.