యాప్నగరం

కడప: సచివాలయ ఉద్యోగిపై వాలంటీర్ దాడి.. ఆ ఒక్క మాటతో!

సర్వేకు సంబంధించి వాలంటీర్‌ను ఇసాక్‌ బాబు ప్రశ్నించారు. దీంతో వాలంటీర్‌ ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించి చేయిచేసుకున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బైక్‌పై వెళ్తుండగా మళ్లీ దాడి.

Samayam Telugu 19 Oct 2021, 11:25 am

ప్రధానాంశాలు:

  • ప్రొద్దుటూరులో కలకలంరేపిన ఘటన
  • సర్వేపై వాలంటీర్‌ను ప్రశ్నించిన ఉద్యోగి
  • దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన వాలంటీర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కడప జిల్లా
కడప జిల్లా ప్రొద్దుటూరులో సచివాలయ ఉద్యోగిపై దాడి కలకలంరేపింది. ఫీవర్‌ సర్వే విషయంపై 8వ వార్డు సచివాలయ ఉద్యోగి ఇసాక్‌ బాబుపై వాలంటీర్‌ రామాంజనేయులు దాడికి పాల్పడ్డారు. సర్వేకు సంబంధించి వాలంటీర్‌ను ఇసాక్‌ బాబు ప్రశ్నించారు. దీంతో వాలంటీర్‌ ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించి చేయిచేసుకున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బైక్‌పై వెళ్తుండగా రామాంజనేయులు అతని స్నేహితులతో కలిసి మరోసారి దాడికి దిగారు. ఈ ఘటనలో ఇసాక్‌బాబుకు కంటి దగ్గర గాయమైంది.
బాధితుడు వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాలంటీర్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సచివాలయ ఉద్యోగిపై దాడి ఘటన తెలియడంతో మున్సిపల్ కమిషనరు వెంకట శివారెడ్డి ఘటనపై ఆరా తీశారు. బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.