యాప్నగరం

బద్వేలు ఎన్నికల్లో జోరుగా గాజు ‘గ్లాసు’ ప్రచారం.. ఏంటిది? ఇక్కడ జనసేన లేదే!

Badvel by elections: మరి కాసేపట్లో బద్వేలు ఉప ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

Samayam Telugu 27 Oct 2021, 4:06 pm
బద్వేలు ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేంటి ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయట్లేదు.. ప్రచారం ఎలా అనుకుంటున్నారా..! అయితే జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఈసీ అధికారికంగా కేటాయించలేదు. దీంతో ఈసారి బద్వేలు ఉప ఎన్నికల్లో ఈ గుర్తును నవతరం పార్టీకి దక్కింది. ఇంకేం.. గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలంటూ నవతరం పార్టీ నాయకులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.
Samayam Telugu బద్వేలు ఉప ఎన్నికలు


బద్వేలు ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ నుంచి బోయ రమేష్ కుమార్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఈసారి నవతరం పార్టీకి కేటాయించారు. ప్రచారంలో భాగంగా ఆ పార్టీ నాయకులు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లేదని.. బీజేపీ నాయకులు చేసేది లేదు.. పెట్టేది లేదని మండిపడ్డారు.

మరోవైపు బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. టీడీపీ, జనసేన బద్వేలు బై ఎలక్షన్స్‌కు దూరంగా ఉండగా.. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. ఈ పార్టీలతోపాటు మరో 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ తరుఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు, బీజేపీ, కాంగ్రెస్ తరుఫున అగ్రనేతలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించారు. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.