యాప్నగరం

మార్చి 1 నుంచి మళ్లీ బడుల మూత..? ప్రచారంపై విద్యాశాఖ మంత్రి స్పందన

కరోనా కారణంగా నెలల తరబడి మూతపడిన స్కూళ్లు ఇటీవలే తెరుచుకోగా... సెకండ్ వేవ్ కారణంగా మార్చి 1 నుంచి మళ్లీ మూతబడతాయని ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖ మంత్రి ఈ ప్రచారాన్ని ఖండించారు.

Samayam Telugu 26 Feb 2021, 6:12 pm
కరోనా వైరస్ విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా నెలల తరబడి మూతపడ్డ విద్యాసంస్థలు ఇటీవలే తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1 నుంచి అన్ని పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ మొదలైందనే ఆందోళన నడుమ.. మార్చి ఒకటో తేదీ నుంచి అన్ని పాఠశాలను మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై విద్యా శాఖ స్పందించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
Samayam Telugu adimulapu suresh


కరోనా కారణంగా మార్చి 1 నుంచి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. దీన్ని ఎవరు వైరల్ చేయొద్దని కోరారు. ఈ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు.

పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని.. అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి స్పష్టం చేశారు. జునియర్ కళాశాలలు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయని అటువంటి వార్తలను నమ్మొద్దని మంత్రి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.