యాప్నగరం

కడప: పొలంలో పురుగుల మందు స్ప్రే చేసేందుకు వెళ్లి ముగ్గురు రైతులు మృతి

Kadapa: కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలంలో పురుగుల మందు పిచికారీ చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు రైతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి అనే రైతులు అన్నదమ్ములు కాగా.. ఈ ఘటనలో బుమ్ము మల్లికార్జున్‌రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 28 Oct 2022, 4:24 pm
రి పొలానికి పురుగుల మందు పిచికారీ చేసేందుకు వెళ్లి ముగ్గురు రైతులు మృత్యువాతపడ్డారు. వీరిలో ఒకరు యువకుడు ఉన్నారు. కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి (65), పెద్దిరెడ్డి బాల ఓబుల్ రెడ్డి (60) బుమ్ము మల్లికార్జునరెడ్డి (23) శుక్రవారం (అక్టోబర్ 28) ఉదయం వరి పొలంలో పురుగుల మందు పిచికారి చేసేందుకు ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారు. పురుగుల మందు స్ప్రే చేస్తుండగా.. కరెంటు స్తంభం నుంచి కిందికి వేలాడిన ఓ విద్యుత్ వైరు తగిలినది. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు ముగ్గురు రైతులు ఈ ఘటనలో మృత్యువాతపడ్డారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి అన్నదమ్ములు కాగా.. మల్లికార్జున్ రెడ్డి వీరి సమీప బంధువు.
Samayam Telugu Kadapa Farmers Death
వరి పొలం వద్ద బంధువుల రోదనలు


ముగ్గురు రైతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్ఐ డాక్టర్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.