యాప్నగరం

కడప: పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన భార్య.. భర్త ఏం చేశాడో తెలిస్తే.. షాకింగ్!

కడప జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత భార్య గర్భం దాల్చడంతో..!

Samayam Telugu 14 May 2021, 8:57 pm
వైఎస్సార్ కడప జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన భార్యను.. అనుమానంతో దారుణంగా చంపేశాడు ఓ కసాయి భర్త. గర్భిణీ అని కూడా చూడకుండా కట్టుకున్న భార్యనే కడతేర్చేశాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


కడప జిల్లా, ఒంటిమిట్ట సీఐ హనుమంతునాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. నందలూరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన సిద్దవటం నరసయ్య, లక్ష్మమ్మకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే, వీరికి పిల్లలు లేరు. ఈ తరుణంలో నాలుగు నెలల క్రితం లక్ష్మమ్మ గర్భం దాల్చింది. అప్పటి నుంచే భార్యపై నరసయ్యకు అనుమానం కలిగింది.

ఈ తరుణంలో బుధవారం టంగుటూరులోని తన సొంత మామిడి తోటలోకి ఉదయం 7 గంటల సమయంలో భార్య లక్ష్మమ్మను వెంట తీసుకువెళ్లారు. అక్కడ భార్యతో గొడవపడ్డ నరసయ్య 11 గంటల సమయంలో హత్య చేశాడు. ఈ విషయం లక్ష్మమ్మ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వచ్చి చూశారు. అయితే, లక్ష్మమ్మ శరీరంపై, గొంతుపై గాయాలు ఉండటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామని సీఐ తెలిపారు. లక్ష్మమ్మ హత్యకు గురైనట్లు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.