యాప్నగరం

కడప రిమ్స్‌లో 8 రోజుల పసికందు అపహరణతో కలకలం.. గర్భవతిలా నటించిన కిలాడీ లేడి, చివర్లో ట్విస్ట్

Kadapa Rims Baby Kidnap కలకలంరేపింది. ఈ నెల 26న జాన్ అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిది. ఈ క్రమంలో ఓ మహిళ ఆమె దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పింది. గర్భిణిగా నటించి బిడ్డను ఇస్తే తన భర్తకు ఓసారి చూపించి తీసుకొస్తానని చెప్పింది. నిజమని నమ్మి ఆమె బిడ్డను ఇచ్చింది. ఆమె ఎంతసేపటికి వెనక్కు రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఆమె పసికందును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.. కొద్దిసేపటికి ఆమె పోలీసులకు దొరికింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 4 Jan 2023, 10:19 am

ప్రధానాంశాలు:

  • కడప రిమ్స్ ఆస్పత్రిలో కలకలం
  • పసికందును ఎత్తుకెళ్లిన మహిళ
  • కొద్దిసేపటికే అరెస్ట్ చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kadapa Rims Baby Kidnap
కడప రిమ్స్‌లో శిశువు అపహరణ కలకలంరేపింది. కొద్దిసేపటికే బిడ్డను తీసుకెళ్లిన మహిళను పోలీసులు పట్టుకున్నారు. ఆమె బిడ్డను తీసుకెళ్లడానికి అతి తెలివితో వ్యవహరించింది.. ఎవరికీ అనుమానం రాకుండా గర్భిణిగా బిల్డప్ ఇచ్చింది.. చివిరికి అడ్డంగా దొరికిపోయింది. చిన్న చెప్పలికి చెందిన మహబూబ్ జాన్ డెలివరీ కోసం డిసెంబర్ 25న రిమ్స్‌లలో చేరింది. డాక్టర్లు 26న సిజేరియన్ చేయగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ తర్వాత వార్డుకు షిఫ్ట్ చేశారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఓ మహిళ.. జాన్ దగ్గరకు వచ్చి మాటలు కలిపింది. తనకు గర్భం వచ్చినట్లు ప్లాస్టిక్ బెల్లినీ కట్టుకుని.. తన భర్తకు చిన్నారిని చూపిస్తానని చెప్పి బిడ్డను తీసుకెళ్లింది. సోనీ ఎంత సేపటికీ వెనక్కు రాక పోవడంతో జాన్ బంధవులు కంగారుపడ్డారు. ఇంతలో ఆ బిడ్డను తీసుకొని లేడీ కిలాడి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే అనుమానంతో జరిగిన విషయాన్ని అక్కడే నర్సుకు చెప్పింది.

వెంటనే నర్సు రిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది. వారు వెంటనే మహిళ కోసం గాలింపు మొదలు పెట్టగా.. కొద్దిసేపటికి ఆ మహిళను కడప ఐటిఐ సర్కిల్ దగ్గర గుర్తించి పట్టుకున్నారు. బిడ్డను తిరిగి రిమ్స్‌‌కు తరలించి తల్లికి అప్పగించారు. బిడ్డ అపహరణతో కొద్దిసేపు ఆస్పత్రిలో గందరగోళం కనిపించింది. బిడ్డను దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పసికందును ఎత్తుకెళ్లింది అక్కాయపల్లెకు చెందిన సోనీగా గుర్తించారు. ఆమెకు పిల్లలు లేరు.. భర్త చనిపోవడంతో బిడ్డను తీసుకెళ్లానని ఒప్పుకుంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని రిమ్స్ అధికారులు అన్నారు. ఘటనపై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపహరణకు గురైన తన బిడ్డను రక్షించిన సెక్యూరిటీ కి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.