యాప్నగరం

డిగ్రీ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది.. కడపలో ఘాతుకం, గ్రామస్తులు అతడిని పట్టుకుని..!

కడప జిల్లాలో ఓ ప్రేమోన్మాది అరాచకానికి ఒడిగట్టాడు. ప్రేమించలేదనే కసితో యువతిని అత్యంత దారుణంగా..!

Samayam Telugu 18 Jun 2021, 9:06 pm
వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతి ప్రేమించలేదనే కారణంతో ఆమె గొంతు కోసి హతమార్చాడు ఓ ఉన్మాది. బద్వేలు మండలం చింతలచెరువులో ఈ ఘాతుకం జరిగింది. ప్రేమను నిరాకరించిందనే కసితో చరణ్ అనే వ్యక్తి.. యువతి గొంతు కోసి చంపేశాడు. దీంతో చరణ్‌ను పట్టుకున్న గ్రామస్తులు.. చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు.
Samayam Telugu కడపలో యువతి శిరీష హత్య


అసలేం జరిగిందంటే.. బద్వేలు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మకు చెందిన శిరీష (18) బద్వేలు వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజీకి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. అయితే, చరణ్ అనే యువకుడు గ్రామంలోకి వచ్చి తనను ప్రేమించాలంటూ శిరీషను బలవంతం చేయడంతో ఆమె నిరాకరించింది.


దీంతో అక్కడే ఉన్న కత్తితో చరణ్.. శిరీష గొంతుకోశాడు. తర్వాత, అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. గమనించిన గ్రామస్తులు ఓ చెట్టుకు కట్టేసిచితక్కొట్టారు. తలపై తీవ్ర గాయంతో చరణ్ స్పృహ కోల్పోయాడు. అనంతరం పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్పృహ కోల్పోయిన చరణ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.