యాప్నగరం

వైఎస్ఆర్‌కు నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల

ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల నివాళర్పించారు.

Samayam Telugu 8 Jul 2021, 9:17 am
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల నివాళర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
Samayam Telugu వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న విజయమ్మ, షర్మిల


వైఎస్సార్ కుమార్తె అయిన షర్మిల ఈరోజు తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం షర్మిల నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్‌ అభిమానుల సమక్షంలో వైఎస్‌ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు ఎజెండాను ప్రకటించనున్నారు. మరోవైపు వైఎస్ఆర్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్న సమయంలో ఇడుపులపాయకు చేరుకుని తండ్రికి నివాళులర్పించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.