యాప్నగరం

బద్వేలు ఉప ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఎంట్రీ..! బీజేపీతో కలిసి ఇలా..

Badvel polling ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటలకు వరకు 10.49 శాతం పోలింగ్ జరిగింది. అధికారులు పోలింగ్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తు్న్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Samayam Telugu 30 Oct 2021, 10:40 am
బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటలకు వరకు 10.49 శాతం పోలింగ్ జరిగింది. అధికారులు పోలింగ్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. బద్వేలు బాలయోగి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ పరిశీలిస్తున్నారు. అలాగే పోలింగ్ అధికారులకు తగు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు.
Samayam Telugu బద్వేలు ఉప ఎన్నికలు


అయితే పలు చోట్ల బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తు్న్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో.. ఆ పార్టీ నేతలు ఇప్పటికే కిందిస్థాయిలో బీజేపీకి మద్దతిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. తాజాగా బీజేపీకి మద్దతుగా టీడీపీ నాయకులు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్‌తో బి.కోడురు మండలంలో టీడీపీ నాయకులు కలిసి ఉన్నట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. 223 బూత్ కాలవపల్లె పోలింగ్ ఏజెంట్‌గా టీడీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి, గోపవరం బూత్-258లో బీజేపీ తరుపున ఇద్దరు ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు నారాయణ, నరసింహులు కుర్చున్నట్లు తెలిసింది.

మరోవైపు గోపవరం ఎస్ఐపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఏజెంట్లను ఎస్ఐ ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరువెంగళాపురం పోలింగ్‌ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు లేవని సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా పోరుమామిళ్లలో బయటి వ్యక్తులు వచ్చారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.