యాప్నగరం

బద్వేలులో వైసీపీ అభ్యర్థి ప్రచారం.. ఓటర్ల రియాక్షన్ ఇదే..

Kadapa: బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రచార జోరు ఊపందుకుంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రతి ఒక్కరికి అందాయా లేదా అంటూ ఆరా తీస్తున్నారు.

Samayam Telugu 18 Oct 2021, 3:10 pm
బద్వేలు బరిలో అధికార వైసీపీ దూసుకుపోతుంది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ ప్రచారం పర్వంలో అందరి కంటే ముందున్నారు. బద్వేలు పట్టణంలోని అన్ని వీధులలో తిరుగుతూ.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నియోజ‌క‌వర్గ ఇంచార్జ్ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు.
Samayam Telugu బద్వేలు ఉప ఎన్నికలు


సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలే ప్రధాన అస్త్రంగా డాక్టర్ సుధా ప్రచారం నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రతి ఒక్కరికి అందాయా లేదా అంటూ ఆరా తీస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

ప్రచారంలో భాగంగా డాక్టర్ సుధా ఏ వీధికి వెళ్లినా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు అంటూ ఓటర్లు సైతం ఆమెతో అంటున్నారు. వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ జిల్లా కీలక నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, బ‌ద్వేల్ టౌన్ వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆప్కాస్ చైర్‌పర్సన్ ఝాన్సీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ 30న బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.