యాప్నగరం

నేడే బెయిల్‌పై కొండారెడ్డి విడుదల.. జిల్లా బహిష్కరణకు ప్రతిపాదనలు..!

కడప జిల్లా చక్రాయ పేట మండలం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ కొండారెడ్డి జిల్లా బహిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ రోజే ఆయన రాయచోటి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 11 May 2022, 9:01 pm
ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ సంస్థను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన కడప జిల్లా పులివెందులకు వైఎస్సార్‌సీపీ నాయకుడు కొండారెడ్డిని జిల్లా బహిష్కరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కలెక్టర్‌కు కడప ఎస్పీ అన్బురాజన్ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. బుధవారమే కొండారెడ్డిపై బెయిల్‌పై విడుదల అయ్యారు. ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. ఎవరైనా బెదిరింపులు, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Samayam Telugu కొండారెడ్డి


కొండారెడ్డి అరెస్ట్ ఇలా..

పులివెందులకు చెందిన కొండారెడ్డి చక్రాయ పేట మండలం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. రాయచోటి-వేంపల్లి మధ్య రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ సంస్థను బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పనులను అడ్డుకుంటున్నారని కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చక్రాయపేట మండలంలో పనులు చేసుకోవాలంటే కొండారెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.

ఈ మేరకు కొండారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ నెల 9వ తేదీన అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించింది. ఈ కాంట్రాక్టర్ సంస్థ కర్ణాటక బీజేపీ మంత్రి శ్రీరాములుకు చెందినది కావడంతో విషయం ఢిల్లీకి చేరినట్లు సమాచారం. బీజేపీ అగ్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఘటనలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి విషయం వెళ్లడంతో.. ఆయన ఆదేశాలతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. నేడు బెయిల్‌పై విడుదలవ్వగా.. జిల్లా బహిష్కరణకు రంగం సిద్ధం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.