యాప్నగరం

సీఎం జగన్‌కి సొంత జిల్లాలో షాక్.? చంద్రబాబుతో వైసీపీ కీలక నేత భేటీ

కడప జిల్లా వైసీపీ కీలక నేత టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది. రాయచోటి వైసీపీలో కీలకంగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లోని నివాసంలో చంద్రబాబును కలిశారు.

Samayam Telugu 19 Jun 2021, 5:28 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి సొంత జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. రాయచోటి నియోజకవర్గ వైసీపీ కీలక నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి ప్రతిపక్ష నేతను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాయచోటి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాయచోటి టీడీపీ బాధ్యతలు చూస్తున్న ఆర్‌ఆర్ బ్రదర్స్‌తో సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ys jagan


రాయచోటి నియోజకవర్గం నుంచి సీఎం జగన్ సన్నిహితుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు ఆయన గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాంప్రసాద్ రెడ్డి రాయచోటి టికెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గడికోట వరుస విజయాలతో దూసుకుపోతుండడంతో పాటు.. ఆయన సీఎంకి సన్నిహితుడని పేరుండడంతో రాంప్రసాద్ రెడ్డికి పార్టీలో ఆశించిన మేర ఆదరణ కరువైందన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారాలని ఆయన నిర్ణయానికి వచ్చి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.