Chandrababu Naidu కూడా శశికళలా.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఇవన్నీ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఏదో జరిగినట్లు నటించి సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Samayam Telugu 1 Dec 2021, 7:45 am
ప్రధానాంశాలు:
- చంద్రబాబుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
- సానుభూతి కోసం ప్రయత్నాలన్న మంత్రి
- రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ
టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. కాని ఏదో జరిగినట్లు బాధ నటించి సానుభూతి కోసం ప్రయత్నించడం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబుది శశికళ శపథం లాంటిదని.. అది నెరవేరదని సెటైర్లు పేల్చారు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఇవన్నీ చేస్తున్నారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం కుటుంబసమేతంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, శ్రీభ్రమరాంబాదేవికి కుంకుమార్చన నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమానికి మల్లన్న ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరికీ మంచి జరిగేలా చూడాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నానని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.