యాప్నగరం

నంద్యాల: శబరిమల వెళుతున్న అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Nandyal Accident జరిగింది. హైదరాబాద్ నుంచి శబరిమల వెళుతుండగా నంద్యాల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సు బోల్తాపడటంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 22 Dec 2022, 8:19 am

ప్రధానాంశాలు:

  • నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం
  • అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
  • ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nandyal Accident
నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాముల మినీ బస్సు టెంపో ట్రావెలర్ బోల్తాపడింది. బస్సులో 15 మంది ప్రయాణిస్తుండగా ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. గాయపడిన వారిని 108 వాహనంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆష్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నారు.. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. నంద్యాల సమీపంలోని కానాల పల్లె మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగిందని.. రోడ్డు పక్కన మినీ బస్సు బోల్తా పడింది అని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.