యాప్నగరం

Kurnool: హైదరాబాద్‌లో కుక్కల దాడి.. 'కర్నూలు' చిన్నారుల్లో వణుకు!

Kurnool: నాలుగు రోజుల కిందట హైదరాబాద్‌ నగరంలో కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్‌ మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనతో ఇటు కర్నూలు వాసుల్లో భయాందోళనలు పెరిగాయి. దానికి కారణం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కుక్కల దాడిలో మరణించిన ఘటనలు ఉండటమే. ఇటు కుక్క కాటు బాధితులు కూడా పెరిగిపోతున్నారు. వీధుల్లో కుక్కల గుంపులను చూసి.. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇక రాత్రి సమయంలో ఇల్లు చేరుకోవాలంటే.. తిప్పలే అని చెబుతున్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 23 Feb 2023, 10:45 am

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌‌లో కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్‌ మృతి
  • కుక్కల దాడితో ఉలిక్కిపడుతున్న కర్నూలు వాసులు
  • బయటకు రావాలంటే జంకుతున్న కర్నూలు ప్రజలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Stray Dogs
వీధి కుక్కలు
Kurnool: తెలుగు రాష్ట్రాల్లో కుక్కల బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇక రాత్రిపూట ఇంటి నుంచి బయటకు రావాలన్నా.. బయట నుంచి ఇంటికి వెళ్లాలన్నా జంకుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను కుక్కలు భయపెడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది పురపాలక సంఘాలు, 55 మండలాల్లో కుక్కల (Dogs) సంఖ్య 50 వేలకుపైగా ఉండటమే అందుకు కారణంగా చెబుతున్నారు.
ముఖ్యంగా పురపాలక సంఘాల్లోనే కుక్కల సంఖ్య 30 వేలకు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్నూలులో 10 వేలు, నంద్యాల 4-5 వేలు, ఆదోని 3-4 వేలు, ఎమ్మిగనూరు 2 వేలు, మిగిలిన పురపాలక సంఘాల్లో సరాసరి వెయ్యి-2 వేల వరకు ఉంటుందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజుకు 10-15 వరకు ఉంటోందని చెబుతున్నారు. చికిత్స పొందినవారి సంఖ్య... నాటు వైద్యం, ఇంటి వైద్యం తీసుకున్న వారితో కలిపి లెక్కిస్తే నెలకు 50కిపైగా ఉంటోందని అధికారులు చెప్పడం.. సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

కర్నూలు నగర పాలక సంస్థ, పురపాలకల్లోనే కుక్కల నియంత్రణ చర్యలు కనిపించడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కుక్కలకు విషం పెట్టి చంపాలనుకున్న ప్రక్రియను జంతు ప్రేమికులు వ్యతిరేకించడంతో.. అది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత అడవుల్లో వదలాలని భావించారు. కానీ.. అలా చేస్తే కేసులు పెడతామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆ విషయంలోనూ వెనుకడుగు వేశారు. చిట్ట చివరికి కుక్కల సంతతి నియంత్రించాలని నిర్ణయించారు. ఆ చర్యలు కూడా మొక్కుబడిగా మారాయి. దీంతో కుక్కల సమస్య పెరుగుతోంది. ఫలితంగా చిన్నారులు బలవుతున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.