యాప్నగరం

కొత్తగా ఇల్లు కొనుగోలు చేసిన భూమా అఖిలప్రియ.. ఆ నియోజకవర్గంపైనా కన్నేశారా.. మరి ఆయన సంగతేంటి!

Bhuma Akhila Priya Reddy దూకుడు పెంచారు. నంద్యాలలో కొత్త ఇల్లు కొనుగోలు చేశారు.. ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. ఉన్నట్టుండి అఖిల ఇల్లు కోనుగోలు చేయడంపై ఆసక్తికర చర్చ. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందిన అభిమానులు, కార్యకర్తలను కాపాడుకోవడమే అంటున్నారు. నంద్యాలలో ఇల్లు కొనుగోలు చేయగానే కొందరు ఆందోళన చెందుతున్నారన్న అఖిలప్రియ. భూమా కుటుంబానికి పదువులు ముఖ్యం కాదంటున్నారు.. కార్యకర్తలు, అభిమానుల్ని కాపాడుకోవడమే ముఖ్యం అన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 19 Sep 2022, 2:05 pm

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
మాజీ మంత్రి, టీడీపీ (TDP) నేత భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya Reddy ) కొత్తగా ఇల్లు కొనుగోలు చేశారు. నంద్యాలలో నూతన గృహంలో అడుగు పెట్టారు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాలలో ఇల్లు తీసుకోవడానికి ప్రధాన కారణం నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందిన అభిమానులు, కార్యకర్తలను కాపాడుకోవడమే అన్నారు అఖిలప్రియ.
నంద్యాలలో భూమా నాగిరెడ్డి పిల్లలు ఇల్లు తీసుకోవడంతో కొందరు ఆందోళన చెందుతున్నారని ఆమె అన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుని చంద్రబాబు, లోకేష్‌లకు బహుమతిగా ఇద్దామన్నారు. తన తల్లిదండ్రులకు ఇచ్చిన సహకారం తమకూ ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. భూమా కుటుంబ సభ్యులకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలు, అభిమానులను కాపాడుకునే బాధ్యతే ముఖ్యమన్నారు అఖిలప్రియ. భూమా నాగిరెడ్డి కుమారుడిగా కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు భూమా జగష్ విఖ్యాత్‌రెడ్డి. అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు.

అఖిలప్రియ ఉన్నట్టుండి నంద్యాలలో ఇల్లు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆమె ఆ నియోజకవర్గంపైనా కన్నేశారా అనే చర్చ మొదలైంది. ఆమె మాత్రం రెండు నియోజకవర్గాలు తమకు ముఖ్యమని.. కార్యకర్తలను కాపాడుకోవడానికే ఇలా చేశామని ఆమె అంటున్నారు. ఇప్పటికే నంద్యాల టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌ వర్గాలుగా ఉన్నాయి. ఇప్పుడు భూమా అఖిలప్రియ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.