యాప్నగరం

రైతు కంట కన్నీరు.. దిక్కుతోచక మొత్తం పంటనే..

Samayam Telugu 17 Dec 2021, 2:25 pm
రైతు కష్టం.. రైతు నష్టం.. రైతు బాధ మరో రైతుకే తెలుస్తుందంటారు.. రేయంబవళ్లు కష్టపడ్డా కనీసం కూలి డబ్బులు కూడా రాని ఓ రైతు.. తన గుండెల్లో మంటలను ఎలా ఆర్పాలో తెలియకే.. పండించిన పంటకు నిప్పు పెట్టేశాడు. దిగుబడి బాగున్నా కనీస ధర కూడా లేకపోవడంతో అటు అమ్మేందుకు ఇష్టపడకా.. ఇటు తోటలో ఉంచేందుకు కష్టమై నాలుగు ఎకరాల అరటి తోటను కాల్చేశాడు.
Samayam Telugu అరటి తోటకు నిప్పుపెట్టిన రైతు


కర్నూలు జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన రైతు మల్లికార్జున తన నాలుగు ఎకరాల పొలంలో అరటి సాగు చేశాడు. పంట దిగుబడి బాగా వచ్చినా.. ధర మాత్రం దారుణంగా పడిపోయింది. దీంతో దళారులు ఎవ్వరూ కొనేందుకు ముందుకు రావడం లేకపోవడంతో.. కాయలన్నీ చెట్ల మీదే పండి రాలిపోతున్నాయి.

ఇప్పటి వరకు రూ. 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడున్న ధరకు అమ్మితే రూ.50 వేలు కూడా రావని రైతు మల్లికార్జున కన్నీటి పర్యంతమయ్యాడు. నిన్నమొన్నటి వరకు కిలో రూ.20 పలికిన అరటిపండ్లు ధర.. ఇప్పుడు ఐదు రూపాయలు, రెండు రూపాయలకు పడిపోవడంతో తీవ్ర ఆవేదన.. కోపానికి గురైన రైతు మొత్తం నాలుగు ఎకరాల్లో ఉన్న అరటితోటకు నిప్పుపెట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.