యాప్నగరం

నంద్యాలలో క్షుద్రపూజలు కలకలం.. మనిషి ఆకారంలో బొమ్మలు పెట్టి, జనాలు బెంబేలు!

కర్నూలు జిల్లా నంద్యాలలో క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజలు నిత్యం తిరిగే వాకింగ్ ట్రాక్‌పైనే ఈ విధంగా చేయడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.

Samayam Telugu 26 Jan 2021, 5:28 pm
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే క్షుద్ర పూజలు చేసి అతికిరాతకంగా హత్య చేసిన ఉదంతం సంచలనం రేపుతున్న తరుణంలో కర్నూలు జిల్లాలో ఓ ఘటన కలకలం రేపింది. కర్నూలు జిల్లా, నంద్యాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎస్బీఐ కాలనీకి సమీపంలో ఉన్న పెద్ద చెరువు వాకింగ్ ట్రాక్‌పై క్షుద్రపూజలు చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu నంద్యాలలో క్షుద్రపూజలు కలకలం


గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఆటోల్లో వచ్చి పూజలు చేసినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. దుండగులు మనుషుల బొమ్మలను మట్టితో చేసి పొట్టేళ్లను బలి ఇచ్చినట్లుగా ఘటనా స్థలంలో ఆధారాలు ఉన్నాయి. ఈ సంఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

కాగా, చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులోని టీచర్స్ కాలనీలో తల్లిదండ్రులే తన ఇద్దరు కుమార్తెలను డంబెల్స్‌తో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా లిమిట్స్ దాటిపోయి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు. క్షుద్రపూజలు చేసిన అనంతరం ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశమైన తరుణంలో నంద్యాలలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.