యాప్నగరం

కర్నూలు జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మల్దార్‌పేటలో ఓ కుటుంబం ఇద్దరు పిల్లలతోపాటు దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 28 Apr 2021, 1:00 pm

ప్రధానాంశాలు:

  • నలుగురు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు
  • ఆర్థిక సమస్యలతోనే ప్రాణాలు తీసుకున్నారని అనుమానం
  • కేసు నమోదు చేసి, ఘటనపై ఆరా తీస్తున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో నలుగరు ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. నడిగడ్డ సమీపంలోని మల్దార్‌పేటలో ఓ కుటుంబం ఇద్దరు పిల్లలతోపాటు దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే నలుగురు ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతులను శేఖర్, కళావతి.. దంపతుల ఇద్దరు కూతుళ్లు అంజని, అఖిలగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బంధువుల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.