యాప్నగరం

కర్నూలు జిల్లాలో అతిసార పంజా.. నలుగురు మృతి, ఆసుపత్రుల్లో బాధితులు

కర్నూలు జిల్లాలో అతిసార దెబ్బకు దెబ్బకు మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఆదోని అరుణజ్యోతి నగర్‌లో 25 మంది అస్వస్థతకు గురయ్యారు.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 7 Apr 2021, 1:20 pm
కర్నూలు జిల్లాలో అతిసార పంజా విసిరింది. పాణ్యంతో పాటూ ఆదోని ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలింది. ఈ మహమ్మారి దెబ్బకు మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఆదోని అరుణజ్యోతి నగర్‌లో 25 మంది అస్వస్థతకు గురయ్యారు.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదోని, నంద్యాల ఆసుపత్రుల్లో అతిసార బాధితులు చికిత్స పొందుతున్నారు. రోగులతో నంద్యాల, ఆదోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.
Samayam Telugu కర్నూలు జిల్లా


పాణ్యం మండలం గోరుకల్లులో అతిసార ప్రబలడంతో నీటి సరఫరా నిలిపివేశారు. నంద్యాల నుంచి గోరుకల్లుకు ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటిని సరఫరా చేయిస్తున్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీరు సరఫరా అవుతుండగా.. మంచినీరు సరఫరా చేసే పై‌ప్‌లైన్‌లో మురికి నీరు కలవడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని అనుమానిస్తున్నారు. అతిసార దెబ్బకు స్థానికులు వణికిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ మహమ్మారితో నలుగురు చనిపోవడం కలకలంరేపుతోంది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.