యాప్నగరం

కర్నూలులో బాలుడి కిడ్నాప్.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే ట్విస్ట్!

కర్నూలు జిల్లాలో బాలుడు కిడ్నాప్ వ్యవహారం చివరికి సుఖాంతమైంది. విచారణలో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 24 Apr 2021, 10:25 pm
కర్నూలు నగరంలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పక్కింట్లో ఉండే వారే నమ్మకంగా ఉంటూ.. బాలుడిని కిడ్నాప్ చేసి అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరంలోని స్వామి‌నగర్‌లో నివాసం ఉంటున్న దేవి అనే మహిళ తన కుమారుడు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు విచారణలో షాకింగ్ విషయం తెలిసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దేవి పక్కింటిలో ఉండే హరికృష్ణ, నాగమణి అనే దంపతులు పక్కా పథకం ప్రకారం బాలుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడిని డోన్‌కు చెందిన మురళి అనే వ్యక్తికి రూ. 20 వేలకు విక్రయించారు. దీనిపై కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించారు. బాలుడిని రక్షించి తల్లి దేవికి అప్పగించారు. మురళి, ఆయన భార్య భూలక్ష్మి కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితులు హరికృష్ణ, నాగమణి మాత్రం పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.