యాప్నగరం

ప్రియురాలు మైనర్, ప్రియుడికి అక్క కూతురితో పెళ్లి.. నంద్యాల జిల్లాలో విషాదం

నంద్యాల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. 40 రోజుల క్రితమే ప్రియుడికి తన అక్క కూతురితో పెళ్లి కాగా.. బుధవారం ప్రియురాలితో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 29 Jun 2022, 3:54 pm
Samayam Telugu Malyala Suicide
Malyala Suicide
నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డోన్ మండలం మల్యాల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన ప్రసాద్, అనితగా గుర్తించారు. ప్రసాద్‌కు 40 రోజుల క్రితం తన అక్క కూతురితో వివాహమైనట్టు తెలుస్తోంది.

అక్క కూతురితో పెళ్లయినప్పటికీ.. ప్రసాద్ అనితను మర్చిపోలేకపోయాడని చెబుతున్నారు. కలిసి బతలేకపోవడంతో.. వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా, అనిత ఈ ఏడాదే పదో తరగతి పూర్తి చేసిందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబీకులకు సమాచార అందించిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఆరంభంలోనూ ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలూరుకు చెందిన విజయ్ అనే యువకుడు కడప జిల్లాలో బీటెక్ చదువుతున్న యువతి ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి సైతం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఆత్మహత్యకుల పాల్పడింది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.