యాప్నగరం

Nandyala: బరితెగించిన భూబకాసురులు.. కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు!

Nandyala: నంద్యాల జిల్లాలో భూబకాసురులు రెచ్చిపోయారు. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. లక్షల విలువైన భూమిని కాజేసేందుకు ప్లాన్ చేశారు. కానీ.. రెవెన్యూ అధికారులు వారికి చెక్ పెట్టారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 22 May 2023, 10:49 pm

ప్రధానాంశాలు:

  • నంద్యాల జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ
  • వక్ఫ్ బోర్డు భూమిపై కన్నేసిన భూబకాసురులు
  • భూమిని కాజేసే ప్లాన్‌కు చెక్ పెట్టిన అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu collector signature forgery
కలెక్టర్ సంతకం ఫోర్జరీ
Nandyala: నంద్యాల జిల్లా మహానంది మండలం యు.బొల్లవరంలో.. వక్ఫ్ బోర్డుకు చెందిన 2.86 ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారు 80 లక్షల వరకు ఉంటుంది. దీనిపై కొందరు భూబకాసురులు కన్నేశారు. వెంటనే బుర్రకు పదను పెట్టి మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ భూమిని వక్ఫ్ బోర్డు పరిధి నుంచి తొలగించినట్లు పత్రాలు తయారు చేశారు. వాటిపై కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ సంతకం ఫోర్జరీ (collector signature forgery) చేసి.. ఆర్డర్స్ రెడీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో.. ఆ భూమిని పట్టా భూమిగా చూపించారు.
అంతా బాగానే ఉన్నా.. ఆ ఉత్తర్వులను చూసిన రెవెన్యూ అధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మార్వో, ఇతర అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి.. కలెక్టర్ ఆశ్చర్యపోయారు. తన సంతకం ఫోర్జరీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్జరీ చేసిన వారిపై పోలీసుకు ఫిర్యాదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో మహానంది తహశీల్దారు జనార్ధన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.