యాప్నగరం

Yuvagalam: వెయ్యి కిలో మీటర్లు దాటిన యువగళం పాదయాత్ర.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్

Yuvagalam: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర.. వెయ్యి కిలోమీటర్లు దాటింది. కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో.. వెయ్యి కిలో మీటర్ల మైలు రాయిని లోకేష్ దాటారు. దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు నారా లోకేష్. పాదయాత్ర లో కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. తన పాదయాత్ర 1000 కి.మి దాటిన సందర్బంగా లోకేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 21 Apr 2023, 6:58 pm

ప్రధానాంశాలు:

  • వెయ్యి కిలో మీటర్లు దాటిన యువగళం పాదయాత్ర
  • వెయ్యి కిలోమీటర్లు దాటాక లోకేష్ ఎమోషనల్ ట్వీట్
  • యువత ఆలోచనలు తనతో పంచుకోవాలని విజ్ఞప్తి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Lokesh Padayatra
లోకేష్ పాదయాత్ర
Yuvagalam: ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్ర.. 77వ రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో.. శుక్రవారం వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ క్రాస్ చేశారు. ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కిలోమీటర్ల పాదయాత్రను యువనేత పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు కడికత్త క్రాస్ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడారు. యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటిన సందర్బంగా Nara Lokesh ఎమోషనల్ ట్వీట్ చేశారు.
'నేను 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నాను. దానిని సాధ్యమయ్యేలా చేసిన ప్రజలకు నమస్కరిస్తున్నా. రాయలసీమ ప్రజలకు జేఎంఆర్‌ (జగన్ మోహన్ రెడ్డి) చేసిన అన్యాయాలను ఎత్తి చూపేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నాను. రాయలసీమలోని ప్రతి కుటుంబాన్ని సుభిక్షంగా మార్చాలని కోరుకుంటున్నాను. ఈ పరివర్తనలో నాకు సహాయం చేయడానికి.. యువత వారి ఆలోచనలను నాతో పంచుకోవాలని కోరుతున్నాను' అని లోకేష్ ట్వీట్ చేశారు. వాట్సాప్ నంబర్, వెబ్‌సైట్, మెయిల్ ఐడీని పోస్టు చేశారు.
ఏపీ ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు.. నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. సరిగ్గా 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలో కాలి నడకన తిరిగి క్షేత్రస్థాయి పరిస్థితులను కళ్లారా చూస్తానని లోకేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.
లోకేష్ పాదయాత్ర జరగనున్న 400 రోజులూ.. ఆయన వెంట 400 మంది వాలంటీర్లు ఉండనున్నారు. పలు జిల్లాలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ.. వారిని వాలంటీర్లుగా నియమించింది. వీరి కోసం లోకేష్ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్‌ షెడ్లు వేసి మంచాలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడే భోజన ఏర్పాట్లూ చేస్తున్నారు. పాదయాత్ర జరిగే 400 రోజులూ కాన్వాయ్‌లోనే నారా లోకేష్ విశ్రాంతి తీసుకోనున్నారు. కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.